YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సోనియాతో మమత భేటీ

సోనియాతో మమత భేటీ

సోనియాతో మమత భేటీ
న్యూఢిల్లీ, జూలై 28,
కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం 10 జనపథ్‌కు వెళ్లి సోనియాతో ఆమె సమావేశమయ్యారు. కేంద్రంలో బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మూడవ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నది. ఈ నేపథ్యంలో సోనియాతో భేటీ సందర్భంగా మమతా బెనర్జీ ఈ అంశంపై ప్రధానంగా చర్చించవచ్చని సమాచారం. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సోనియా, రాహుల్‌తోపాటు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో సమావేశమై ఈ అంశంపై చర్చించిట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మరి కొందరు నేతలను కూడా మమతా బెనర్జీ కలవనున్నారు.

Related Posts