YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దళిత బంధుపై ఈసీకి కంప్లయింట్

దళిత బంధుపై ఈసీకి కంప్లయింట్

దళిత బంధుపై ఈసీకి కంప్లయింట్
హైదరాబాద్, జూలై 28
ఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగిలింది. దళితుల కోసం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం అమలుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పూర్తయ్యేంత వరకు నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని భావిస్తే.. హుజూరాబాద్ మినహా మిగిలిన 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలుచేసేలా చర్యలు తీసుకోవచ్చని సూచించింది.ఫోరమ్ కార్యదర్శి పద్మనాభరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బుధవారం రాసిన లేఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా ఉదహరించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో లేనప్పటికీ ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. హుజూరాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకునే దళిత బంధును అమలు చేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆ లేఖలో పద్మనాభ రెడ్డి ప్రస్తావించారు.దళిత బంధు స్కీమ్ మంచిదే అయినా ఇప్పుడు హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో తెరపైకి తీసుకురావడం హుజూరామాద్ ఓటర్లను ప్రలోభపెట్టడమేనని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ పథకం ఎన్నికలలో లాభం కోసమేనని ప్రకటించడం తీవ్రమైన అంశమన్నారు. ఎన్నికలకు ముందే కోట్లాది రూపాయలతో పథకాలను రూపొందించడం ఓటర్లను ప్రలోభానికి గురిచేయడమేనని ఆయన ఆరోపించారు.

Related Posts