YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కు దినేశ్, హార్దిక్

రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కు దినేశ్, హార్దిక్

భారత క్రికెటర్లు దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా ఐసీసీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టుకు ఎంపికయ్యారు. ‘హరికేన్ రిలీఫ్ టీ20 ఛాలెంజ్’ పేరిట నిర్వహించనున్న మ్యాచ్‌లో ఐసీసీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవెన్‌తో వెస్టిండీస్ జట్టు తలపడబోతోంది. మే 31న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్‌లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు.భయంకర తుపానులు ఇర్మా, మరాయా కిందటేడాది కరేబియన్ దీవులను వణికించింది. ఈ తపానుల కారణంగా కరేబియన్ దీవుల్లోని ఐదు క్రికెట్ మైదానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆంగ్విలాలోని రొనాల్డ్ వెబ్‌స్టర్ పార్క్, ఆంటిగ్వాలోని సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియం, డొమినికాలోని విన్డ్‌సర్ పార్క్ స్టేడియం, బీవీఐలోని ఎ.ఓ.షిర్లే రిక్రియేషన్ గ్రౌండ్, సెయింట్ మార్టిన్‌లోని కారిబ్ లంబర్ బాల్ పార్క్ మైదానాలు తుపాను దాటికి దెబ్బతిన్నాయి. ఇప్పుడు వీటిని పునరుద్ధరణ పనుల కోసం ఇప్పుడు ఐసీసీ నిధుల సేకరణలో పడింది. దీనిలో భాగంగానే వెస్టిండీస్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవెన్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహిస్తున్నారు.హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఎంపికతో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టు సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక పాకిస్థాన్ నుంచి షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిది వరల్డ్ జట్టుకు ఎంపికయ్యారు. శ్రీలంక నుంచి తిసారా పెరీరా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, ఆఫ్ఘానిస్తాన్ స్టార్ లెగ్-స్పిన్నర్ రషీద్ ఖాన్ వరల్డ్ జట్టుకు ఎంపికయ్యారు. మిగిలిన ఆటగాళ్లను త్వరలోనే ఎంపిక చేయనున్నారు.ఇక విండీస్ బోర్డు 13 మంది సభ్యులతో పటిష్టమైన జట్టును ప్రకటించింది. కార్లోస్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. క్రిస్ గేల్, మార్లోన్ శామ్యూల్స్, ఆండ్రూ రసెల్ వంటి హేమాహేమీలు జట్టులో ఉన్నారు

Related Posts