ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల వారోత్సవాలు
విశాఖపట్నం
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల వారోత్సవాలు బుధవారం నుంచి జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పోలీసులు రెండో రోజు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు అమరవీరుల పేరిట స్థూపాల ఏర్పాటుకు పోటీగా స్థూపాలు ఏర్పాటయ్యాయి. సీలేరు గూడెంకొత్తవీధి కొయ్యూరు పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించాయి.