ఈటల రాజేందర్ అవినీతిపరుడు
హైదరాబాద్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ అవినీతిపరుడని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. పదవిని అడ్డం పెట్టుకొని 700 ఎకరాలు సంపాదించాడు. నువు కబ్జా చేసిన భూములను తిరిగి వారికివాలి. ఈటల రాజేందర్ ను ఎన్నికల్లో బహిష్కరించాలని అన్నారు. తాను ఆక్రమించుకున్న దళితుల భూములను తిరిగివమని ఈటల రాజేందర్ కు చెప్పా. ఈ దళితబంధు స్కీం ను రాష్ట్రం అంతా అమలుచేయాలని సీ ఎం కేసీఆర్ ను కోరుతున్నానని అన్నారు.
దళితబంధు పథకం దళితుల ఆత్మగౌరవం కోసం. దళితులు ఆత్మగౌరవంతో బతకడం కొంతమందికి ఇష్టం లేనట్లు ఉంది. దళితబంధు పథకానికి గండి కొట్టడానికి జరిగే కుట్రను ఖండిస్తున్నా. ఒక దళిత కుటుంబానికి 10లక్షలు ఇస్తానన్న కేసీఆర్ లాంటి మొనగాడు భారతదేశంలో లేడు. దళితులు అందరూ ఏకమై కేసీఆర్ కు మద్దతు తెలుపాలి. మరియమ్మ విషయంలో ఆ కుటుంబానికి కేసీఆర్ న్యాయం చేసి భరోసా కల్పించారని అన్నారు.
దళితుల కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతా అంటే ఎందుకు అంతభాధ!. రాజగోపాల్ రెడ్డి ముందు రాజీనామా చేసి విమర్శలు చెయ్యాలి. దళితులకు భూములు లేవు- రైతుబంధు రావడం లేదు. భూములు లేని దళితులకు దళితబంధు వర్తిస్తుంది. 10లక్షల రూపాయలు కాంగ్రెస్- బీజేపీ ఇస్తదా? ఈటెల రాజేందర్ అవినీతి పరుడా- కాదా? దళిత భూములు ఉన్నాయని రాజేందర్ స్వయంగా చెప్పారు! ఆలయ భూములు- దళిత భూములు ఈటెల రాజేందర్ వాపస్ ఇవ్వాలనిఅయన అన్నారు.
ఈటెల రాజేందర్ ను హుజురాబాద్ ఎన్నిక నుంచి బహిష్కరించాలి! ఫ్లూడల్ విధానానికి స్వస్తి పలికి- సమసమాజ స్థాపన రావాలి. 70 ఏళ్లలో ఎన్ని పథకాలు వచ్చినా దళితులకు న్యాయం జరగలేదు. దళితబంధు పథకం వల్ల అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేస్తా అంటున్నాడు ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు. దళిత బంధు అంటే నీకు నచ్చడం లేదా ...ఈ పథకం అమలు చేస్తే అడ్డుకోవడం మంచిది కాదు. రాజగోపాల్ రాజీనామా చేస్తే గెలిసేది అక్కడ టీఆరెస్ పార్టీ మాత్రమే. ఈ స్కిం ఎందుకు అమలు చేయద్దు. 70 యేండ్లలో మా జాతికి ఎం చేశారు ఇవాళ 10 లక్షలు ఇస్తాం అంటే ఎందుకు మీకు ఈర్ష. 10 లక్షలు ఇచ్చిన రాజకీయ పార్టీలు లేరు. సీఎం కేసీఆర్ మనం మద్దతు తెలుపాలి. దళిత జాతికి న్యాయం చేస్తాం అంటే తప్పు ఏంటి...ఎందుకు అడ్డుకుంటున్నరు. పేదల పాపం మీకు తగులుతోంది. హుజురాబాద్ లో దళిత బంధు పై ప్రచారం చేస్తా. ఈటల రాజేందర్ ను ఒడిస్తాను. చాలా గొప్ప పథకం ,ఈ పథకం అమలు కోసం ఎంతైనా ఖర్చు పెడుతాం అని చెప్పారు. దళిత ఇండ్ల విషయంలో కూడా ఆలోచనా చేస్తాం అన్నారు. ఉద్యోగ కల్పన కోసం 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పారు. నాకు మనస్సు నిండా సంతృప్తి ఉంది నా జాతికి 10 లక్షల ఇస్తాం అన్నారనని అయన అన్నారు. ఈటల రాజేందర్ బామ్మర్ది ఎవడు మా జాతిని అవమాన పర్చడనికి. ఈటల రాజేందర్ కబ్జా చేసిన భూముల దగ్గర ధర్నా చేస్తా. ఈటల భూముల్లో జెండాలు పాతుతా. దళిత బంధు తో ఎంతో మేలు జరుగుతుంది. నా సంపూర్ణ మద్దతు సీఎం కేసీఆర్ కు ఉంటుంది. ఈ స్కిం అమలు అయితే దేశానికి రోల్ మెడల్ అవుతుంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మన కోసం మన జాతి కోసం పని చేస్తున్న నాయకుడు కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా దండోరా వేసి ప్రచారం చేస్తా. ఈటల రాజేందర్ కు డిపాజిట్ రాకుండా చేస్తా. రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేస్తా. ఎక్కడ కూడా ఒక్క రూపాయి పక్క దారి పట్టకుండా డైరెక్ట్ గా వారి ఖాతా లో వేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. ఇలాంటి గొప్ప పథకం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. దీనికి అడ్డుపడుతున్న వాళ్ళను తన్ని ఈ పథకం తీసుకోవాలని కోరుతున్నా. ఈ పథకం వద్దు అన్నవారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు.