కూర్మన్నపాలేంలో అక్రమ నిర్మాణం కూల్చివేత
అడ్డుకున్న బిల్డర్, గ్రామస్థులు…ఉద్రిక్తత
విశాఖ
కూర్మన్నపాలెం రాసాలమ్మ కాలనీలో మూడంతస్తుల అక్రమ నిర్మాణం భవనాన్ని కూల్చటానికి టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చారు. వారిని బిల్డింగ్ యజమాని, గ్రామస్తులు అబ్బుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు గ్రామస్తుల మధ్య వివాదం చెలరేగింది. దాంతో పొలీసులు భారీగా మోహరించారు. బిల్డింగ్ యజమాని గింజుపల్లి శంకర్రావు మాట్లాడుతూ కూర్మన్నపాలేం రాసాలమ్మ కాలనిలో జీ+ 2 భవానాన్ని నిర్మించాం. కొద్దరోజుల క్రితం 86 వ వార్డూ కార్పోరేటర్ లేళ్ళ కోటేశ్వర్రావు ఇంటికి పిలిపించి మీ ఇంటి నిర్మాణం కొరకు కాంట్రాక్టర్ వైసిపి నాయకుడికి ఇచ్చావు కనుక వెంటనే అతనికి సెటిల్ చేసి పంపమని చెప్పటంతో అది కుదరధని చెప్పానని అన్నారు. టౌన్ ప్లానింగ్ అదికారులు అప్రవల్ లేకుండా నిర్మాణం చేయటంతో బిల్డంగ్ పై స్లాబును తొలగించారని అన్నారు.
దామా సుబ్బారావు మాట్లాడుతూ కేవలం వైకాపా చెందిన కాంట్రాక్టర్ కు బిల్డింగ్ కట్టడానికి ఇవ్వటంతో అదికారులను పంపించి కూల్చివేసారని అన్నారు.