దేవినేని కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు
విజయవాడ
మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. విజయవాడ శివారులోని గొల్లపూడిలో దేవినేని ఇంటికి వచ్చిన చంద్రబాబు, ఉమ భార్య పిల్లలతో మాట్లాడారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని, నిజనిర్ధారణకు వెళ్లి మాజీ మంత్రి ఉమ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి ధైర్యం అందించేందుకు తాను వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. దేవినేని ఉమ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, భయపడాల్సిన పని లేదని బాబు ధైర్యం చెప్పారు.