తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం
మహిళా మోర్చా భేటీలో బండి సంజయ్
హైదరాబాద్
బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా/సోషల్ మీడియా వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్, దుష్యంత్ కుమార్ గౌతమ్, తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, సుజాత సబట్ పాదీ, దీప్తి రావత్, తదితరులు హజరయ్యారు.
సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ పావన భూమి. పవిత్ర క్షేత్రం . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడానికి తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మస్వరాజ్ కృక్రుషి ఎంతో ఉంది. ఆమెను సదా స్మరించుకుంటామని అన్నారు.ఆమెకు నివాళులు అర్పిస్తున్నాం. వేలాది మంది బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సైద్దాంతిక భావజాలం వ్యాప్తి కోసం, బీజేపీ జెండా ఎగరేయడానికి, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో మంది తమ ప్రాణత్యాగం చేశారు. వేలాది మంది నక్సలైట్ల చేతిలో తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆ మహనీయుల బలిదానాలు వ్రుథా కానివ్వం. వారి స్పూర్తితో జాతీయవాద భావజాలాన్ని ముందుకు తీసుకెళతాం. తెలంగాణలో బీజేపీ జెండాను కచ్చితంగా ఎగరేస్తామని అన్నారు.