YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

దాసరి కొడుకులపై పోలీసు కేసు

దాసరి కొడుకులపై పోలీసు కేసు

దాసరి కొడుకులపై పోలీసు కేసు
హైదరాబాద్
సినీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దాసరి నారాయణరావు తీసుకున్న అప్పును చెల్లిస్తామని చెప్పిన కుమారులు ఇప్పుడు మొహం చాటేసారని ఫిర్యాదు. 2012లో దాసరినారాయణరావు రెండు కోట్ల పది లక్షల అప్పు తీసుకున్నారు. 2018 నవంబర్ 13న దాసరి నారాయణ రావు మరణం తర్వాత ఆయన కుమారులు అరుణ్, ప్రభు  పెద్దమనుషుల సమక్షంలో అప్పు చెల్లిస్తామని మాట ఇచ్చారు. రెండు కోట్ల పది లక్షలకు గానూ కోటి 15 లక్షలు ఇస్తామని అంగీకారం కుదిరింది. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకపోవడం అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు సోమశేఖర్  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.

Related Posts