కర్నూలు
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధి హామీ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అయన స్థానిక ఎంపీడీవో కు వినతి పత్రం అందచేసారు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడం తోనే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కక్ష సాధింపు చర్య తోనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్య మొండి వైఖరితో బిల్లులు చెల్లించకపోవడంతో అనేకమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. అరకొరగా అక్కడక్కడ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు వస్తే వైసిపి కమిషన్ల రెడ్డి కాచుకొని కూర్చున్నాడని ఎద్దేవా చేసారు.