మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలిసిన వై.వి రామిరెడ్డి
నెల్లూరు
నెల్లూరు జిల్లా, ఆర్ అండ్ బి అతిథి భవనం నందు, నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వై.వి రామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి , ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం తరఫున తమ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి బాలినేని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను జిల్లాకు ప్రత్యేక తరహాలో అందించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.