YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడివుంది మంత్రి అవంతి

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడివుంది మంత్రి అవంతి

విశాఖపట్నం
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసా యాన్ని లాభసాటి చేయడమే ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావే శంలో మంత్రి పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని, రైతు శ్రేయస్సు కోరి నియోజకవర్గ, మండల స్థాయిల్లో రైతు భరోసా కేంద్రా లు వ్యవస్థ తీసుకొచ్చి ముఖ్యమంత్రి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని మంత్రి అన్నారు. జిల్లాలో 627 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా మని, ఇప్పటికే 80 పూర్తయి రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామన్నారు.వైసీపీ ప్రభు త్వం ఏర్పడ్డాక వ్యవసాయానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం గొప్ప విషయమన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాలు, గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు మరిన్ని పెంచుతామని అన్నారు.ఈ-క్రాప్ విధానంలో రైతులందరినీ నమోదు చేసి.. వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.

Related Posts