YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివేకా హత్య కేసు

వివేకా హత్య కేసు

పులివెందుల ఆగస్టు 03
పులివెందులలో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 57వ రోజు కొనసాగింది. రెండు బృందాలు పులివెందులకు వచ్చి  విచారిస్తున్నారు.  సోమవారం రాత్రి పులివెందుల ఆర్అండ్బి అతిథి గృహం చేరుకున్న సీబీఐ బృందం మంగళవారం ఉదయం  డ్రైవర్ దస్తగిరిని విచారణకు పిలిచారు.  దాదాపు గంటకు పైగా హత్య కేసుకు సంబంధించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  అంతకుముందు మరో బృందం వివేకా ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించింది. వివేకా ఇంటి నుంచి సమీపంలోని ఆటో మొబైల్ దుకాణం వరకు సీబీఐ అధికారులు కొలతలు తీసుకున్నారు.  వివేకా ఇంటి రోడ్డు మార్గంలో ఇరువైపులా ఉన్న కొలతలను ఆటో మొబైల్ దుకాణం ప్రహరీ గోడను.. దాని ఎత్తును పరిశీలించి సర్వేయర్ ద్వారా కొలతలు వేసి రికార్డును నమోదు చేసుకున్నారు.  హత్య జరిగిన రోజు ఈ ప్రాంతం నుంచి దుండగులు ఏమైనా వెళ్ళారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఒక బృందం పులివెందుల నుంచి కడపకు రాగానే.. మరో బృందం కడప నుంచి పులివెందుల చేరుకొని అనుమానితులను విచారిస్తున్నారు.

Related Posts