YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మీసం మెలేస్తే కేసులా???

మీసం మెలేస్తే కేసులా???

కళ్యాణదుర్గం
రాష్ట్రంలో పలువురు మంత్రులు బూతులు మాట్లాడుతుంటే లేని అభ్యంతరం మీసం మెలేస్తే తప్పు అవుతుందా?? అంటూ ప్రశ్నించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు. కళ్యాణదుర్గం లోని ఎన్టీ ఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమామ హేశ్వర నాయుడు మాట్లాడుతూ తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి పై పోలీసులు మీసం మెలేసినందుకు పెట్టిన కేసు ఈ విషయంపై మండిపడ్డారు. రాష్ట్రంలో కొడాలి నాని, అనిల్ యాదవ్, పేర్ని నాని వంటి మంత్రులు నానా బండ బూతులు తిడుతుంటే లేని అభ్యంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం తిప్పితే ఎవరికి నష్టం అంటూ ఉమామహేశ్వర నాయుడు ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని సూచించారు.

Related Posts