YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా జపసేన

స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా జపసేన

విశాఖపట్నం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ  గత కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద   జనసేన ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు.కేంద్ర  ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భం గా రాష్ట్ర నాయకులు శివశంకర్, విజయకుమార్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్  ఎవడబ్బ సొత్తు కాదని, 32మంది ప్రాణ త్యాగలతో ఏర్పడింది అని గుర్తు చేశారు. బీజేపీ తో ఎన్నికల విషయం లో మాత్రమే జనసేన పొత్తు అని, సంస్థాగతమైన నిర్ణయాల్లో జనసేన స్టాండ్ ప్రజల పక్షాన వుంటుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితులలో విశాఖ ఉక్కు ని ప్రైవేటు పరం కానివ్వం అన్నారు. ఈ దీక్ష లో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts