విశాఖపట్నం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భం గా రాష్ట్ర నాయకులు శివశంకర్, విజయకుమార్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ఎవడబ్బ సొత్తు కాదని, 32మంది ప్రాణ త్యాగలతో ఏర్పడింది అని గుర్తు చేశారు. బీజేపీ తో ఎన్నికల విషయం లో మాత్రమే జనసేన పొత్తు అని, సంస్థాగతమైన నిర్ణయాల్లో జనసేన స్టాండ్ ప్రజల పక్షాన వుంటుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితులలో విశాఖ ఉక్కు ని ప్రైవేటు పరం కానివ్వం అన్నారు. ఈ దీక్ష లో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.