హైదరాబాద్
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఇంచార్జ్ భాద్యతలును అప్పగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఐదు మంది వర్కింగ్ ప్రెసిడెంట్లకు పార్లమెంటరి భాద్యతలు అప్పగించారు. గీతారెడ్డి కి సికింద్రాబాద్- నల్గొండ- హైదరాబాద్ తో పాటు రీసెర్చ్ సెల్- ఇంటలెక్చవల్ వింగ్ భాద్యతలు, అంజన్ కుమార్ యాదవ్ కు నిజామాబాద్- మహబూబాబాద్- మెదక్- పెద్దపల్లి తో పాటు యూత్ కాంగ్రెస్- మైనార్టీ- ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ భాద్యతలు, అజారుద్దీన్ కు ఆదిలాబాద్- జహీరాబాద్- మల్కాజిగిరి తో పాటు సోషల్ మీడియా, జగ్గారెడ్డికి ఖమ్మం- వరంగల్- భువనగిరి- కరీంనగర్ పార్లమెంట్ తో పాటు మహిళా కాంగ్రెస్, ఐఎన్టీయూసీ - లేబర్ సెల్, అసంఘటిత సంఘాల భాద్యతలు, మహేష్ కుమార్ గౌడ్ కు మహబూబ్నగర్, నగరకర్నూల్, చేవెళ్ల పార్లమెంట్ తో పాటు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, సెల్ డిపార్ట్ మెంట్స్ భాద్యతలు అప్పగించారు.