మత్స్యశాఖలో భారీ కుంభకోణం..ఏడు కోట్ల నిధులు స్వాహా
ఏలూరు ఆగష్టు 3
పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఏడు కోట్ల రూపాయల నిధులను ఇంటి దొంగలు స్వాహా చేశారు. బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను ఫోర్జరీ సంతకాలతో కొందరు ఉద్యోగులు డ్రా చేశారు. గత ఏడాది కరోనాతో మృతి చెందిన ఒక ఉద్యోగి కీలకపాత్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాఖాపరమైన ఆడిట్ చేస్తుండగా స్కామ్ బయటపడింది. పోలీసులకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. రహస్యంగా పోలీసులు విచారణ చేపట్టారు.