భూ హక్కు , భూరక్ష కార్యక్రమంలో పాల్గొన్న డిపిఓ
నెల్లూరు
భూహక్కు, భూరక్ష సర్వే కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి పాల్గొన్నారు.నెల్లూరు రూరల్ పరిధిలోని మన్నవరప్పాడు లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా సర్వే కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి పాల్గొని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించారు. ఈ సందర్భంగా గ్రామ కంఠం భూ సర్వే సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూమి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు భూహక్కు భూరక్ష మరియు సర్వేపై అవగాహన కలిగి ఉండాలన్నారు .ఈ కార్యక్రమంలో స్థానిక ఈవోపీఆర్డీ, సర్వే అధికారులు స్థానికులు దితరులు పాల్గొన్నారు.