YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 వేగంగా పల్నాడు హైవే నిర్మాణం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ

 వేగంగా పల్నాడు హైవే నిర్మాణం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ

 వేగంగా పల్నాడు హైవే నిర్మాణం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ
న్యూఢిల్లీ
నాగార్జున సాగర్ నుండి పేరేచర్ల వరకు కొత్త జాతీయ రహదారిని మంజూరు చేసినందున కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు ప్రాంతం నుండి ఇంత పెద్ద ప్రాజెక్టును మంజూరు చేసినందున, మద్ధతు ఇచ్చినందున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేందుకు ఢిల్లీలో మంత్రి ని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కలిసారు. పల్నాడు ప్రజలు ఆర్థికంగా ప్రయోజనం పొందేలా కొత్త హైవేను వేగంగా నిర్మించాలని మంత్రిని అభ్యర్థించారు. దీని నిర్మాణం పల్నాడు ప్రాంత అభివృద్ధికి, స్థానిక అభివృద్ధిని పెంచడానికి దోహదపడుతుందని ఎంపీ వివరించారు. ఈ హైవే త్వరిత నిర్మాణానికి తమ పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

Related Posts