YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ముఖ్యమంత్రి సహాయనిధి  చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

ముఖ్యమంత్రి సహాయనిధి  చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

ముఖ్యమంత్రి సహాయనిధి  చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
 కామారెడ్డి ఆగస్టు 03
కామారెడ్డి నియోజికవర్గంలోని 38 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 21 లక్షల 19 వేల 500 రూపాయల చెక్కులను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 865 మందికి 5 కోట్ల 28 లక్షల 82 వేల 400 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. అందుకు సంబంధించిన పత్రాలను తమ కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, దోమకొండ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, భిక్కనూరు ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్,ప్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు గండ్ర మధుసూదన్రావు, గోపి గౌడ్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts