YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

28 నుంచి ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

28 నుంచి ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

దక్షిణ భారత యాత్ర పేరిట కేరళతోపాటు మైసూర్, ఊటీ పర్యాటక ప్రాంతాలకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక ప్యాకేజీనీ ప్రకటించింది. 9 రోజులపాటు సాగే పర్యటన మే28, 2018 నుంచి జూన్ 5 వరకు కొనసాగుతుంది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ డిప్యూటీ మేనేజర్ సంజీవయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మే 28 సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా బయలుదేరే రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా బయలుదేరుతుంది. రైలు ప్రయాణంలో ఏసీ త్రీ టైర్‌తోపాటు 12 స్లీపర్‌క్లాస్ బోగీలు ఉన్నాయని తెలిపారు. ప్యాకేజీలో భాగంగా స్లీపర్‌క్లాస్‌కు ఒక్కో పర్యాటకుడికి రూ. 12,705, ఏసీ త్రీ టైర్ రూ.14,595 ఉంటుందని తెలిపారు. ప్రయాణంలో భాగంగా భోజన సదుపాయం, పర్యాటక ప్రదేశంలో నాన్ ఏసీ వాహనాల్లో రోడ్డు ప్రయాణం, వసతి సదుపాయం, టూర్ ఎస్కార్ట్ , పర్యాటక బీమా కల్పిస్తారని తెలిపారు.

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు..ఐఆర్‌సీటీసీ కార్యాలయాల నెంబరు: 040-27702407, 9701360701, 9701360647/671/697, 8374000782/783, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 9701360690, పర్యాటక భవన్ 040-23400606,9701360698 నంబర్లను సంప్రదించాలని కోరారు. వెబ్‌సైట్ www.irctctourism.com ను సంప్రదించాలని సూచించారు.

Related Posts