YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

లక్ష్మీనృసింహస్వామి స్వామి సన్నిధిలో పుష్పార్చన

లక్ష్మీనృసింహస్వామి స్వామి సన్నిధిలో పుష్పార్చన

లక్ష్మీనృసింహస్వామి స్వామి సన్నిధిలో పుష్పార్చన
యాదాద్రి భువనగిరి ఆగష్టు 4
ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష్మీనృసింహస్వామి స్వామి సన్నిధిలో బుధవారం లక్ష పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సహస్ర నామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ‌ రకాల పూలతో లక్ష పుష్పార్చన జరిపారు. సుమారు రెండు గంటల పాటు పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువు దీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. కార్యక్రమంలో దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, వేద పండితులు, అర్చక బృందం, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

Related Posts