తీన్మార్ మల్లన్న తన వైఖరిని మార్చుకోవాలి
తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం
హైదరాబాద్
ప్రజాస్వామ్యయుతంగా గెలిచి పరిపాలన చేస్తున్న ప్రజాప్రతినిధుల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీన్మార్ మల్లన్న తన వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాములు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం సరైన పద్ధతి అని అయితే రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించాలని సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రుల పట్ల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. మల్లన్న అలియాస్ నవీన్ కు ప్రజలపై ప్రేమాభిమానాలు ఉంటే ప్రజాప్రతినిధిగా గెలిచి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను శాసనసభ పార్లమెంటు సాక్షిగా నిలదీయాలని అన్నారు. మల్లన్న తీరు మార్చుకోకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.