YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మమతకు మోడీ ఫోన్

మమతకు మోడీ ఫోన్

మమతకు మోడీ ఫోన్
న్యూఢిల్లీ, ఆగస్టు 4,
ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఇవాళ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి ఫోన్ చేశారు. బెంగాల్‌లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల విల‌యం గురించి ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. బెంగాల్‌లో వివిధ డ్యామ్‌ల నుంచి భారీగా విడుద‌ల అవుతున్న నీటి వ‌ల్ల కొన్ని లోత‌ట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అయితే వ‌ర‌ద‌ల వ‌ల్ల దెబ్బ‌తిన్న వారిని ఆదుకుంటామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. మ‌రో వైపు హౌరా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ సీఎం మ‌మ‌తా విజిట్ చేస్తున్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత ఆమె ప్ర‌ధానితో ఫోన్‌లో మాట్లాడారు. దామోద‌ర్ వాలీ కార్పొరేష‌న్ డ్యామ్ నుంచి నీరు విడుద‌లైన ఘ‌ట‌న‌లో సుమారు 15 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. వేలాది మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

Related Posts