YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పారిశుధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ

పారిశుధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ

పారిశుధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ
నెల్లూరు
 నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం బి.వి. నగర్ లోని కే.ఎన్.అర్. హై స్కూల్ లో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 800 మంది పారిశుద్ధ్య కార్మికులకు 9 రకాల నిత్యావసర సరుకులను  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ దినేష్ కుమార్ ఐఏఎస్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు పణంగాపెట్టి, ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు అభినందనీయమన్నారు. పారిశుధ్య కార్మికులగురించి ఎంతచెప్పినా తక్కువేనని, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.
 ఇటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అక్షయపాత్ర ఫౌండేషన్ బృందాన్నికి అభినందనలు తెలియజేయాల్సి ఉందన్నారు. సేవా దృక్పథం కలిగిన దాతలు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ హెల్త్ ఆఫీసర్, 23వ డివిజన్ ఇంఛార్జ్ మూలే విజయభాస్కర్ రెడ్డి, సురేష్ రెడ్డి, జిల్లా పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు మెయిళ్ల గౌరీ, చేజర్ల మహేష్, ఒరిసా శ్రీనివాసులు రెడ్డి , వైసీపీ సీనియర్ నాయకులు మిద్దె మురళీ కృష్ణా యాదవ్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts