YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పార్ల‌మెంట్‌ను ఎంత అడ్డుకున్నా..స్వార్థ‌ప‌రుల రాజ‌కీయాల‌కు త‌లొగ్గేదిలేదు... స్పష్టం చేసిన ప్రదాని మోడీ

పార్ల‌మెంట్‌ను ఎంత అడ్డుకున్నా..స్వార్థ‌ప‌రుల రాజ‌కీయాల‌కు త‌లొగ్గేదిలేదు... స్పష్టం చేసిన ప్రదాని మోడీ

న్యూఢిల్లీ ఆగష్టు 5
టోక్యోలో మ‌నోళ్లు హాకీ బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన ఈ నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌తిప‌క్షాల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని మోదీ ఓ కామెంట్ చేశారు. హాకీలో మ‌నోళ్లు గోల్స్ చేస్తుంటే అంద‌రూ సెల‌బ్రేట్ చేసుకున్నార‌ని, కానీ కొంద‌రు మాత్రం సెల్ప్ గోల్ చేసుకుంటున్నార‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. దేశ ప్ర‌గ‌తిని అడ్డుకునేందుకు పార్ల‌మెంట్‌లో ప్ర‌తిప‌క్షాలు శ‌తవిధాల ప్ర‌యత్నిస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. పార్ల‌మెంట్‌ను అడ్డుకుంటున్న ప్ర‌తిప‌క్షాల తీరును ప్ర‌జ‌లు స‌హించ‌రు అని మోదీ అన్నారు. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా దేశం ముందుకు వెళ్తోంద‌న్నారు. నెగ‌టివ్ ప్ర‌జ‌లు దేశ పురోగ‌తిని అడ్డుకోలేద‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న స్కీమ్‌తో ప్ర‌యోజ‌నం పొందిన ల‌బ్ధిదారుల‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో మోదీ ఈ కామెంట్స్ చేశారు. పార్ల‌మెంట్‌ను ఎంత అడ్డుకున్నా.. స్వార్థ‌ప‌రుల రాజ‌కీయాల‌కు త‌లొగ్గేదిలేద‌న్నారు.

Related Posts