తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా
సానియా మిర్జా స్థానంలో పీవీ సింధూను నియమించాలి
ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్
సానియా మిర్జా స్థానంలో పీవీ సిందూను కొత్త అంబాసిడర్ గా నియమించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేసారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సాహించడం లేదు. పాకిస్తాన్ కొడలు సానియా మీర్జా కు బ్రాండ్ అంబాసిడర్ ఇచ్చారు. పీవీ సింధుకు ఎందుకు ఇవ్వడం లేదు.. ఆమెను ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదని అయన ప్రశ్నించారు. ఈ రోజు దేశం పండగ వాతావరణం లో ఉంది. హాకీ విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. కానీ ఇక్కడ క్రీడా మైదానాలు పేకాట కు అడ్డాగా మారాయి. కోచ్ లకు వేతనాలు ఇవ్వడం లేదు.. వారు ఆందోళన లు చేస్తున్నారని అయన అన్నారు.