YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ ఆటిట్యేడే ప్రమాధం : ఈటల

కేసీఆర్ ఆటిట్యేడే ప్రమాధం : ఈటల

కేసీఆర్ ఆటిట్యేడే ప్రమాధం : ఈటల
హైదరాబాద్, ఆగస్టు 5, 
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిశ్చార్జ్ అయ్యారు. తాను బాగుండాలని పూజలు చేసి దీవించిన హుజురాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 18 ఏళ్లుగా ఉద్యమంలో పనిచేసి వివిధ హోదాలో ఉన్న వారికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఉద్యమ సహచరులు కనుమరుగయ్యారు. మానుకోటలో రాళ్లు వేసిన వారికి ఎమ్మెల్సీ పదవి అప్పగించారన్నారు. 2018 ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారన్నారు.నన్ను ఓడించడానికి పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టారన్నారు. కుట్రలను, కుతంత్రాలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు ఈటల. ప్రజాస్వామ్యంలో ప్రజలను నమ్ముకుంటారన్నారు. కేసీఆర్ డబ్బులను నమ్ముకుంటారన్నారు. 150 కోట్ల రూపాయలు నగదు రూపంలో అమలు చేస్తున్నారన్నారు.2018 ఎన్నికల్లో 57 ఏళ్ళు నిండిన వారికి పింఛన్లు ఇస్తామన్నారు. మూడేళ్ళ తర్వాత హుజురాబాద్ ఓట్లపై ప్రేమతో ఇప్పుడు ఇచ్చారన్నారు.నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని ఈటల డిమాండ్ చేశారు. ఈ రోజు గొర్రెలను ఇవ్వడంతో సంతోషంగా ఉందని అన్నారు. గొల్ల కూర్మల ఓట్లు కొల్లగొట్టడానికి లబ్ధిదారుల కంట్రీబ్యూషన్ కూడా ప్రభుత్వమే కడుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఏనాడు నివాళులు అర్పించని కేసీఆర్.. దళిత బంధు పేరుతో దళితులపై ప్రేమ కురిపిస్తున్నారన్నారు. వందల మంది పోలీసులు మఫ్టీలో ఒక్కొక్క కుటుంబాన్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారు.గొర్రెలు ఇచ్చినా, చేపలు ఇచ్చినా, రుణమాఫీ చేసినా హుజురాబాద్ ప్రజలు మాత్రం ధర్మం వైపే ఉన్నారన్నారు. రాజకీయాలను పవిత్రంగా ఉంచాలన్నారు. పార్టీలు, జెండాలు, సిద్ధాంతాల కంటే... కేసీఆర్ అటిట్యూట్ రాష్ట్రానికి ప్రమాదం కాబట్టి అందరూ ఒక్కటీ కావాలన్నారు. తన పాదయాత్ర కొనసాగుతుందని ఈటల స్పష్టం చేశారు. మూడు రోజులుగా వాకింగ్ మొదలు పెట్టి ఆ తర్వాత పాద యాత్ర మొదలు పెడతానన్నారు.

Related Posts