ప్రొ.ఆచార్య జయశంకర్ ఆశయాలను సాధించాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి ఆగస్ట్ 06
ప్రొ.ఆచార్య జయశంకర్ ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆచార్య ప్రొ.జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి, అమరవీరుల స్థూపానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆచార్య జయశంకర్ జయంతిని స్టేట్ ఫంక్షన్ లాగా నిర్వహిస్తున్నామని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చిత్రపట్టానికి నివాళులర్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రొ.ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదని, ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక సంక్షేమ అభివృద్ది పథకాలను అధికారులు క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొ.జయశంకర్ గారు చాలా కృషి చేసారని, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఆచార్య ప్రొ. జయశంకర్ స్వరాష్ట్రం సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసారని, రాష్ట్ర అభివృద్ది కొరకు మంచి ప్రణాళికలు సైతం రుపొందించారని, ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతి అధికారి చంద్రమౌళీ, జిల్లా వైద్యారొగ్య శాఖ అధికారి డా.ప్రమోద్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ.ప్రసాద్, కలెక్టరేట్ కార్యాలయ పర్యవేక్షకులు తూము రవీందర్, దత్తు ప్రసాద్, నారాయణ, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.