YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ ప‌రేడ్‌.. గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్

 ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ ప‌రేడ్‌.. గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్

 ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ ప‌రేడ్‌..
గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్
హైద‌రాబాద్ ఆగష్టు 6
హైద‌రాబాద్‌లోని స‌ర్దార్ వల్ల‌భాయ్ ప‌టేల్ జాతీయ పోలీసు అకాడ‌మీలో శిక్ష‌ణ పూర్తి చేసుకున్న 72వ ఐపీఎస్ బ్యాచ్ దీక్షాంత్ స‌మ‌రోహ్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా శిక్ష‌ణ పొందిన 178 మంది అధికారులు ప‌రేడ్ నిర్వ‌హించారు. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ వారి నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. 144 మంది ఐపీఎస్‌లు, 34 మంది ఫారెన్ ఆఫీస‌ర్ ట్రైనీలు శిక్ష‌ణ పూర్తి చేసుకున్నారు. 144 మందిలో 23 మంది మ‌హిళా ఐపీఎస్ అధికారులు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు న‌లుగురు చొప్పున ప్రొబేష‌న‌రీ ఐపీఎస్‌ల‌ను కేటాయించారు. దీక్షాంత్ స‌మ‌రోహ్‌కు యువ ఐపీఎస్ రంజీత శ‌ర్మ నేతృత్వం వ‌హించారు. 72వ బ్యాచ్‌లో రంజీత శ‌ర్మ ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు.

Related Posts