హుజురాబాద్
హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కు వచ్చిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను స్థానిక బిజెపి నాయకులు అడ్డుకున్నారు. గ్రామ సర్పంచ్ కరుణాకర్ బిజెపి పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉండగా, గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సర్పంచ్ కు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎలా చేపడతారు అంటూ బిజెపి నాయకులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు బీజేపీ నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. జై కేసీఆర్ అంటూ తెరాస, జై ఈటెల అంటూ బీజేపీ కార్యకర్తలు పోటాపోటిగా నినాదాలు చేసారు. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.