సైబరాబాద్ కమీషనరేట్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సన్ సిటీ, పీ అండ్ టీ కాలనీలలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 400 ఇళ్ళలో తనిఖీలు చేసారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున విదేశీయులు పోలీసులకు పట్టుబడ్డారు. వీసా గడువు ముగియడంతో పాటు సరైన పత్రాలు లేని 19 మంది వేదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరిఓ పదిహేడు మంది నైజీరీయా, ఇద్దరు కామెరూన్ దేశానికి చెందినవారు. ఎలాంటి పత్రాలు లేని నాలుగు కార్లు, పందోమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ జోన్ డిసిపి పద్మజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ అండ్ సెర్చ్ లో శంషాబాద్, రాజేంద్రనగర్ డివిజన్ ఎసిపి లు సిఐలు ఎస్సై ల సహా మొత్తం 200 మంది సిబ్బంది కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.