YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

అక్రమ బెల్లం స్వాధీనం

అక్రమ బెల్లం స్వాధీనం

నిజామాబాద్
ప్రతిరోజు  మాదిరి  ఈ రోజు  మద్నూర్ ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమ నల్ల బెల్లం పట్టుబడింది.మహారాష్ట్ర నుండి తెలంగాణ కు అక్రమంగా తరలిస్తున్న 145 బస్తాల నల్ల బెల్లం తో పాటు లారీ నీ సీజ్ చేసి ఒకరి మీద కేసు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లోని సలాబాత్ పూర్ ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద చేస్తున్న తనిఖీల్లో భారీ మొత్తంలో నల్లబెల్లం పట్టు బడింది.మహారాష్ట్ర లోని లాతూర్ నుండి తెలంగాణ కు అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం ను ఈ రోజు ఉదయం ఎక్సైజ్ పోలీసులు పట్టుకొన్నారు.30 కిలోల పరిమాణం గల 145 బస్తాల నల్ల బెల్లం తో పాటు లారీని సీజ్ చేశారు.నల్ల బెల్లం అక్రమ రవణా చేస్తున్న షేక్ మహబూబ్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.43.50 క్వింటాళ్ల గల నల్ల బెల్లం 1,27,890 రూపాయల విలువ చేస్తుందని  ఎక్సైజ్ ఎస్సై జనార్ధన్ అన్నారు.

Related Posts