YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్పందన' వేదికను సద్వినియోగం చూసుకోవాలి కమిషనర్ దినేష్ కుమార్

స్పందన' వేదికను సద్వినియోగం చూసుకోవాలి కమిషనర్ దినేష్ కుమార్

స్పందన' వేదికను సద్వినియోగం చూసుకోవాలి
కమిషనర్ దినేష్ కుమార్
నెల్లూరు
నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న స్పందన వేదికను సద్వినియోగం చేసుకుని వివిధ సమస్యలకు సత్వర పరిష్కారం పొందాలని కమిషనర్ దినేష్ కుమార్ ఆకాంక్షించారు. కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారులతో కలిసి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్, రెవెన్యూ విభాగాలకు సంభందించి ఈరోజు 29 సమస్యలను అందుకున్నామని, స్పందన వేదిక ద్వారా వేగవంతమైన పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. స్పందన కార్యక్రమంలో అధికారులంతా ఓకే చోట అందుబాటులో ఉంటారు ,కావున స్పందన వేదిక ద్వారా అందుకున్న ఫిర్యాదులను సంబంధిత శాఖలకు బదిలీ చేసి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పర్యవేక్షిస్తామని కమిషనర్ స్పష్టం చేసారు. గతవారం స్పందన కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తుల న్నిటికీ అధికారుల ద్వారా పరిష్కార మార్గం చూపించి, స్పందన కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతంగా నిర్వహించామని కమిషనర్ సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ లోని అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Posts