రంగారెడ్డి
పెండింగ్ లో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని రాజేంద్రనగర్ బీజేవైఎం అసెం బ్లీ కన్వీనర్ సురెడ్డి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాజేంద్ర నగర్ సర్కిల్ ఆరం ఘర్ చౌరస్తా వద్ద గతంలో బీజేవైఎం ఆధ్వర్యంలో అరంగల్ చౌరస్తా వద్ద గతములో భిక్షాటన చేయగా, నేడు ఆరంగర్ బస్టాప్ వద్ద ప్రజల యొక్క షూలు పాలిష్ చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు అన్న నినాదం తో గద్దెనెక్కిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పటి వరకు తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. ఒంటరి తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు