YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు సుప్రీంకోర్టు జ‌రిమానా

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు సుప్రీంకోర్టు జ‌రిమానా

న్యూఢిల్లీ ఆగష్టు 10
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు సుప్రీంకోర్టు జ‌రిమానా విధించింది. ఆ రెండు పార్టీల‌తో పాటు మొత్తం తొమ్మిది పార్టీల‌కు అత్యున్న‌త న్యాయ‌స్థానం ఫైన్ వేసింది. త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌పై ఉన్న నేర చ‌రిత్ర‌ను బ‌య‌ట‌పెట్ట‌ని కార‌ణంగా.. ఆ పార్టీల‌కు ఫైన్ విధిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు చెప్పింది. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల‌కు ల‌క్ష జ‌రిమానా విధించ‌గా.. సీపీఎం, ఎన్సీపీలకు 5 ల‌క్ష‌ల ఫైన్ వేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఆ పార్టీలు త‌మ ఆదేశాలు పాటించ‌లేద‌ని కోర్టు పేర్కొన్న‌ది. ఇవాళ ఓ కేసులో సుప్రీం ధ‌ర్మాసం.. అన్ని రాజకీయ పార్టీల‌కు కీల‌క ఆదేశాలు చేసిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఓ అభ్య‌ర్థిని ఎంపిక చేసి 48 గంట‌ల్లోపు ఆ అభ్య‌ర్థికి సంబంధించిన క్రిమిన‌ల్ రికార్డుల‌ను బ‌య‌ట‌పెట్టాలని స్ప‌ష్టం చేసింది. జ‌స్టిస్ ఆర్ఎఫ్ నారీమ‌న్‌, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌ల‌తో కూడి ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం ఆ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని కోసం ఓ మొబైల్ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసి దాంట్లో క్రిమిన‌ల్ రికార్డుల‌ను పొందుప‌రుచాల‌ని కోర్టు ఆదేశించింది.

Related Posts