YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

అమ్మవారి సేవలో  వైవి సుబ్బారెడ్డి దంపతులు

అమ్మవారి సేవలో  వైవి సుబ్బారెడ్డి దంపతులు

అమ్మవారి సేవలో  వైవి సుబ్బారెడ్డి దంపతులు
తిరుపతి
 తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ గా నియమితులైన వైవి సుబ్బారెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో  మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు.చైర్మన్ గా బుధవారం పదవీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో వారు అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయం ఎదుట జేఈవో సదా భార్గవి సుబ్బారెడ్డికి స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకుని దర్శనానికి వెళ్ళిన సుబ్బారెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దర్శనం అనంతరం అర్చకులు ప్రసాదాలు అందించారు. చంద్రగిరి శాసనసభ్యులు  చెవిరెడ్డి భాస్కరరెడ్డి ,ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరి బాయి, విజివో  మనోహర్ పాల్గొన్నారు.

Related Posts