వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తడిసిన మిర్చి,పత్తి, మొక్కజోన్న యార్డులను కాంగ్రెస్, తెలంగాణ జన సమితి నాయకులు సందర్శించారు. అకాల వర్షానికి తడిసిన వాటికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసారు. ఎమ్మెల్యే లు, మంత్రులు నేరుగా మార్కెట్ కు వచ్చి రైతుల బాధలను తెలుసుకోని ఆదుకోవాలని అన్నారు. వ్యవసాయ మార్కెట్లో రైతులను తక్షణమే అదుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మంత్రి హరీష్ రావు వెంటనే నేరుగా మార్కెట్ కు వచ్చి రైతుల బాధలను తెలుసుకోని ఆదుకోవాలని అన్నారు.