YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం

దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం

తిరుమల
ప్రపంచ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, కొవిడ్ నుంచి విముక్తి లభించేలా చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు కొవిడ్ పూర్తిగా పోయే వరకు కొనసాగిస్తామని టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు.చైర్మన్ గా పదవీ భాద్యతలు చేపట్టిన తర్వాత అదికారులతో సమావేశమయ్యారు. గో ఆధారిత ఎరువుల ద్వారానే పండించిన ఉత్పత్తులతో స్వామి వారికి నిత్య నైవేద్యం సమర్పించే కార్యక్రమం వంద రోజులకుపైగా కొనసాగుతోందన్నారు. శాశ్వతంగా కార్యక్రమం కొనసాగే ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. సామాన్య భక్తులకు సులభంగా, శీష్రంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. కొవిడ్ కారణంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా నిలిపి వేసిన సర్వ దర్శనం 15 రోజుల్లోపు కొంత సంఖ్యలోనైనా పునరుద్ధరించే అవకాశాలు పరిశీలించేందుకు అధికారులతో చర్చిస్తానని చైర్మన్‌ వివరించారు.

Related Posts