YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దోపీడి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా ముఠా అరెస్ట్....

దోపీడి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా ముఠా  అరెస్ట్....

పోలీసుల కళ్ళుగప్పి నగరంలో పలు ప్రాంతాలలో  దోపిడి, దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠాను నార్సింగి పోలీసులు ఎట్టకేలకే అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. నిందితుల వద్ద నుంచి 5. 5 తులాల బంగారు ఆభరణాలు, 9 చారవాణిలతో పాటు 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు మాదాపూర్ డీసీపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరులా సమావేశం లో డీసీపి వెంకటేశ్వర్ రావు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శంకర్పల్లి ప్రాంతానికి చెందిన శివకుమార్(21), సయ్యద్ వాజీద్(23), చిల్కూర్ మోయినాబాద్ ప్రాంతానికి చెందిన దినేష్రెడ్డి(20), భరత్ కుమార్(24), గండిపేట్ బండ్లగూడా ప్రాంతానికి చెందిన జగదీశ్ (18)లు సునాయాసంగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో స్థానికంగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి దారిలో వచ్చిన వారి పై సైతం దాడి చేసి గొలుసులను దొంగిలించేవారు. అంతే కాకుండా తాళం వేసిన ఇళ్ళతో పాటు పలు చిల్లర దోపీడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.  విశ్వసనీయ సమాచారంతో నార్సింగి పోలీసులు వల పన్ని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో ఏసీపి లు శ్యాంప్రసాద్ రావు, గంగారెడ్డి, నార్సింగి సీఐ రమణాగౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Related Posts