జిల్లాలోని శామీర్పేట మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులు కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన డ్రైవర్ రాజు(24) సత్తెవ్వ(35)శ్రావణ్(12) శాలిని(12)గా గుర్తించారు. ఎయిర్పోర్టుకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.