YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గడువులోగా ప్రపంచ బ్యాంకు పనులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

గడువులోగా ప్రపంచ బ్యాంకు పనులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న పనుల్లో నిర్లక్ష్యం చూపొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ హెచ్చరించారు. నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సచివాలయంలో సాయంత్రం ప్రపంచ బ్యాంకు నిధులపై చేపట్టిన వివిధ ప్రాజెక్టు ప్రగతిపై  వివిధ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన పనులపై ఆ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తుఫాన్ షెల్టర్లు, విశాఖలోని కైలాసగిరి, బీచ్ ప్రాంతాల అభివృద్ధి, నర్సరీల ఏర్పాటు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల కిందచేపట్టిన రోడ్డు నిర్మాణ పనులపై సమీక్షించారు. పోలీసు, విద్య, అగ్నిమాపక శాఖల్లో చేపట్టిన పనులపైనా చర్చించారు. ఉపాధి హామీ కింద అందజేసే మొక్కల పెంపకం వల్ల ఆదాయం వచ్చేలా చూడాలని సీఎస్ ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యంలోగా పనులు చేయాలని ఆయా శాఖల ప్రిన్సిపల్ కార్యాదర్శులకు స్పష్టం చేశారు. నిధుల విడుదలలో జాప్యం చోటుచేసుకుంటే తన దష్టికి తీసుకురావలన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇందుకోసం నెల నెలా కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని, నెలవారీ రిపోర్టులు తయారు చేయాలని సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ మాలకొండయ్యతో పాటు పలు శాఖల ముఖ్య కారదర్శులు పాల్గొన్నారు.

Related Posts