YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కారులో మంటలు…ప్రయాణికులు సురక్షితం

కారులో మంటలు…ప్రయాణికులు సురక్షితం

కారులో మంటలు…ప్రయాణికులు సురక్షితం
సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కొహీర్ మండలం దిగ్వాల్ గ్రామ జాతీయ రహదారిపై ఓ కారు దగ్దం అయింది. ఈ కార్లో ప్రయాణిస్తున్న ఇద్దరు పరిస్థితి ని గమనించి దిగిపోవడం తో ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు  ఇద్దరు వ్యక్తులు కార్ లో ప్రయాణిస్తున్న కారు దిగ్వాల్ గ్రామం వద్దకు రాగానే కార్ ముందు భాగంలో ని ఇంజిన్ లో మంటలు రావడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు దిగి పోవడం తో ప్రమాదం తప్పింది . అనంతరం ఆ కార్ మొత్తం మంటల్లో దగ్దం అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడి కి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే కార్ మొత్తం కాలిపోయింది. ఆ కార్ లో ప్రయాణిస్తున్న ఇద్దరు వెనుకగా వస్తున్న  కార్ లో ఎక్కి వెళ్లిపోవడంతో వారి వివరాలు తెలియరాలేదు. కొహీర్ పోలీసులు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts