YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను మరింత వేగవంతం చేసిన సీబీఐ

వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను మరింత వేగవంతం చేసిన సీబీఐ

వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను మరింత వేగవంతం చేసిన సీబీఐ
అమరావతి ఆగష్టు 13
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైనా సీబీఐ అధికారులు దృష్టి సారించింది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ విచారించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీబీఐ అధికారులు శివశంకర్‌ రెడ్డిని పలు అంశాలపై ప్రశ్నించారు. గతంలో సిట్, సీబీఐ బృందాలు సైతం శివశంకర్ రెడ్డిని విచారించాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను సైతం సీబీఐ అధికారులు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. 68 రోజులుగా సుధీర్ఘంగా కొనసాగిస్తున్న విచారణలో కీలక ఆధారాలను సైతం సేకరించారు. త్వరలోనే ఈ కేసులో నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related Posts