YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైతులకు త్రీ ఫేస్ కరెంట్ ల్యాప్ టాప్ లు, ఫోన్లు

రైతులకు త్రీ ఫేస్ కరెంట్ ల్యాప్ టాప్ లు, ఫోన్లు

కర్ణాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప శుక్రవారం ఉదయం విడుదల చేశారు. యడ్యూరప్ప మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు తాను చేసే మొట్టమొదటి ప్రకటన రైతులు, నేతన్నల రుణాలు రూ.1 లక్ష వరకు రద్దు చేయడమేనన్నారు. రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించేందుకు ‘మిషన్ కల్యాణి’ని ప్రారంభిస్తామని చెప్పారు.జయనగర ఎమ్మెల్యే విజయ్ కుమార్ హఠాన్మరనానికి బీజేపీ నాయకులు శ్రధ్దాంజలి ఘటించి అనంతరం ఎన్నికల మేని ఫెస్టోను విడుదల చేశారు. రైతుల రుణమాఫీలు, విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లు, మహిళలకు ఉచిత స్మార్ట్ ఫోన్, నిరుద్యోగులకు ఉద్యోడాలు ఇస్తామని హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొంటున్న బీజేపీ ఆచ‌ర‌ణ సాధ్యం కాని హామీల‌ను సైతం ఇచ్చింది. ఆ

* ముఖ్యమంత్రి ల్యాప్ టాప్ పథకంలో భాగంగా కాలేజ్ లో చేరిన ప్రతి విద్యార్థికి ఉచిత ల్యాప్ టాప్ లు మంజూరు.

* బెంగళూరు, మైసూరు, మంగళూరు, రాయచూరు, హుబ్బళి, కలబురగిలో స్టార్స్ ఆప్ కంపెనీలు స్థాపించడానికి భూములు మంజూరు చేసి ఇతర సౌకర్యాలు కల్పించడం.

* ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో క్రీడలు ప్రోత్సహించడానికి రూ. 100 కోట్లు మంజూరు. 

* కనీస మద్దతు ధర కంటే రైతులకు, చిరు వ్యాపారులకు ఒక‌టిన్న‌ర రెట్లు అధిక ధర ఇవ్వడం.

* ధరలు వ్యత్యాసం వచ్చిన సందర్బంలో రైతులను ఆదుకోవడానికి రూ. 5,000 కోట్లతో రైతు బంధు అర్హత నిధి పథకం. 

* భూమి లేని వ్యవసాయ కార్మికుల కోసం ముఖ్యమంత్రి రైతు సురక్షా భీమా పథకంలో ఉచితంగా రూ. 2 లక్షలు ప్రమాధ భీమా మంజూరు.

* రాష్ట్రంలోని అన్ని జలాశయాల పనులు 2023లోపు పూర్తి చెయ్యడానికి రూ. 1. 5 లక్షల కోట్లు మంజూరు. 

* రాష్ట్రంలోని అన్ని చెరువులు పూడికలు తీసి శ్రభ్రం చెయ్యడానికి మిషన్ కళ్యాణి పథకం. 

* రైతుల పంప్ సెట్లకు ప్రతి రోజు 10 గంటల పాటు త్రీఫేస్ విద్యుత్ సరఫరా. 

* వ్యవసాయ విభాగంలో శిక్షణ తీసుకుంటున్న రైతుల బిడ్డల కోసం రూ. 100 కోట్లతో రైతు బంధు విద్యార్థి వేతనాలు మంజూరు.

* ముఖ్యమంత్రి వ్యవసాయ ఫెలోషిఫ్ పథకంలో భాగంగా సాంకేతిక పద్దతితో వ్యవసాయం చెయ్యడానికి ప్రతి సంవత్సరం 1,000 రైతులను చైనా, ఇజ్రాయిల్ పంపించి శిక్షణ ఇప్పించడం.

* కేఎంఎఫ్ ద్వారా పండ్లు, కూరగాయాల ఉత్పత్తి కోసం రూ. 3,000 కోట్లు నిధి. 

* పశు పరిశోధన కేంద్రాలకు అవసరమైన కేంద్రాలు స్థాపించడానికి రూ. 3,000 కోట్లతో కామధేను పథకం.

* గ్రామీణ ప్రదేశాల్లో పశువులు, ఇతర ప్రాణులకు ఉచిత చికిత్స చేయించడానికి కేఎంఎఫ్ ద్వారా రూ. 1,000 కోట్ల నిధులు.

బీజేపీ తన మేనిఫెస్టోలో ఎక్కువగా రైతులు, యువత, నిరుద్యోగులు, కాలేజ్ విద్యార్థులకు వరాలు కురిపించింది. 

Related Posts