YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

త్వరలో తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్‌: మంత్రి కేటిఆర్

త్వరలో తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్‌: మంత్రి కేటిఆర్

త్వరలో తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్‌: మంత్రి కేటిఆర్
హైద‌రాబాద్ ఆగష్టు 19
తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రారంభించ‌నున్న‌ట్లు రాష్ట్ర మంత్రులు కె. తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ని చేపట్టాలని ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు, ఆ ప్రాజెక్టు పురోగతి పైన గురువారం మంత్రులు ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ములుగు, సిరిసిల్ల జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టి రెండు జిల్లాల ప్రజల హెల్త్ ప్రొఫైల్ ని సిద్ధం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆచరణలోకి తీసుకువస్తామని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు.ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఐటీ శాఖ ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్, మొబైల్ ప్లాట్‌ఫాంపై అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రస్తావించారు. టెక్నాలజీ సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, అత్యంత సులభంగా ప్రభుత్వ సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని ఆయ‌న తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన క‌నీస‌ ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ఆ శాఖ పరిధిలో చేపట్టేటువంటి భవిష్యత్తు ప్రణాళికలకు సరైన ప్రాతిపదిక అవుతుందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా పౌరుల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా లభించే సమాచార విశ్లేషణ చేయడం వలన వివిధ జిల్లాల్లో ప్రత్యేకించి ఉన్న వ్యాధులు మరియు సీజనల్ వ్యాధుల హెల్త్ ట్రెండ్స్ ని గుర్తించవచ్చు అన్నారు. తద్వారా ఆయా ఆరోగ్య సమస్యలకు అవసరమైన నివారణ, చికిత్సకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల లాంటి సమయాల్లో అత్యవసర చికిత్స అందించేందుకు ప్రజల ప్రాథమిక సమాచారం సహాయ పడుతుంద‌న్నారు.ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను ప్రజల ఇంటివద్దనే సేకరించ‌నున్న‌ట్లు తెలిపారు. ముఖ్యంగా బీపీ, షుగర్, యూరిన్, వివిధ రక్త పరీక్షల వివరాలను అక్కడికక్కడే క్షేత్రస్థాయిలో సేకరించ‌నున్‌రట్లు చెప్పారు. ఎవరికైనా అదనపు పరీక్షల అవసరం తలెత్తితే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్ల ద్వారా ఆయా పరీక్షలను నిర్వహించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇలాంటి  హెల్త్ ప్రొఫైల్ రికార్డుని ఇప్పటికే పూర్తిచేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేయాలని సూచించారు.వైద్య శాఖ ఉన్నతాధికారులు సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి, వాకటి కరుణ, శ్రీనివాస్ రావు, రమేష్, గంగాధర్, ఐటీ శాఖ ఉన్నతాధికారులు జయేష్‌ రంజన్, జి. వెంకటేశ్వరరావు, త‌దిత‌రులు ఈ స‌మీక్షా సమావేశానికి హాజరయ్యారు.

Related Posts