YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బుచ్చయ్యచౌదరిని బుజ్జగించేందుకు టీడీపీ త్రిసభ్య బృందం గంటన్నర పాటు బృందం చర్చలు.. ఫోన్‌చేసి 20 నిమిషాలు మాట్లాదిన  చంద్రబాబు

బుచ్చయ్యచౌదరిని బుజ్జగించేందుకు టీడీపీ త్రిసభ్య బృందం గంటన్నర పాటు బృందం చర్చలు.. ఫోన్‌చేసి 20 నిమిషాలు మాట్లాదిన  చంద్రబాబు

బుచ్చయ్యచౌదరిని బుజ్జగించేందుకు టీడీపీ త్రిసభ్య బృందం
గంటన్నర పాటు బృందం చర్చలు..
ఫోన్‌చేసి 20 నిమిషాలు మాట్లాదిన  చంద్రబాబు
రాజమండ్రి ఆగష్టు 20
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పార్టీ అధిష్ఠానంపై అలిగారు. తీవ్ర అసంతృప్తితో.. తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి వారం రోజుల్లో రాజీనామా చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పడం పార్టీలో కలకలం రేపింది. ఈ నేపద్యం లో  బుచ్చయ్యచౌదరితో టీడీపీ బృందం గంటన్నర పాటు త్రిసభ్య బృందం చర్చలు సాగాయి. సమావేశం అనంతరం టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌రావు మీడియాతో మాట్లాడుతూ బుచ్చయ్యచౌదరితో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. రాజమండ్రి టీడీపీలో ఇబ్బందులపై గోరంట్ల చెప్పారని, ఆయన డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా జోక్యం చేసుకుంటారని గద్దె రామ్మోహన్‌రావు తెలిపారు.. తక్షణమే రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు ఫోన్‌చేసి 20 నిమిషాలు మాట్లాడారు. చంద్రబాబు ఆదేశాలతో బుచ్చయ్యచౌదరిని బుజ్జగించేందుకు టీడీపీ త్రిసభ్య బృందం ఆయనను కలిసింది. టీడీపీ బృందంలో మాజీమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, జవహర్‌, గద్దె రామ్మోహన్‌ ఉన్నారు. రాజమండ్రి అర్బన్‌లో బుచ్చయ్యచౌదరి చెబుతున్న పేర్లను పరిశీలనలోకి తీసుకోవడంతో పాటు ఆదిరెడ్డి అప్పారావు, బుచ్చయ్యచౌదరి మధ్య విభేదాలను తొలగించాలని టీడీపీ హైకమాండ్‌ ఆదేశించింది.

Related Posts