YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో వైఎస్ ఫోటోలు

కర్ణాటకలో వైఎస్ ఫోటోలు

సామదానబేధదండోపాయాలన్నీ ఉపయోగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్లు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాజకీయ నేతలను కూడా వదలడం లేదు. తెలుగు మాట్లాడే, తెలుగు మూలాలున్న ప్రజలు పెద్ద ఎత్తున ఉన్న ప్రాంతాల్లో తెలుగు రాజకీయ నేతల చేత ప్రచారం చేయిస్తోంది కాంగ్రెస్. బీజేపీ కూడా ఇదే తరహాలో తమ పార్టీ తెలుగు నేతలను తీసుకెళ్లి ప్రచారం చేయించుకుంటోంది. తెలుగు మూలాలున్న ప్రజల ఓట్లను తెలుగు నేతల ద్వారా, తెలుగు సినిమా వాళ్ల ద్వారా ప్రభావితం చేయాలని ఈ రెండు పార్టీలూ చూస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోను కూడా తమ ప్రచారం వాడేసుకుంటున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏర్పాటు చేసుకుంటున్న హోర్డింగుల్లో వైఎస్ ఫొటోను కూడా వాడుతున్నారు. ప్రధానంగా తెలుగు మాట్లాడే ప్రజలున్న ఏరియాల్లో ఈ తీరు కనిపిస్తోంది. సోనియాగాంధీ, రాహుల్ ఫొటోలు, కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేతల ఫొటోలతో పాటు వైఎస్ బొమ్మను కూడా హోర్డింగులపై వేయించుకుంటున్నారు అభ్యర్థులు. 

Related Posts