YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలి : మంత్రి నారాయణ

పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలి : మంత్రి నారాయణ

పోలీసులు సమాజానికి కంచె లాంటివారు . సరిహద్దుల్లో సైనికులు, సమాజంలో పోలీసులు నిరంతరం శత్రువులతో పోరాడుతూనే ఉంటారని  మంత్రి నారాయణ అన్నారు. శనివారం నాడు అయన వెంకటగిరి లోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 9వ బెటాలియన్ పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొన్నారు. కఠోర శిక్షణ పూర్తిచేసుకున్న 262 మంది పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. మనం శాంతిగా జీవించడానికి పోలీసులు చేస్తున్న త్యాగాలు మరువలేనివని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో 20వేల మంది పోలీసుల కొరత ఉంది అందుకే, ప్రభుత్వం కొత్తగా 6000 మంది పోలీసుల నియామకాన్ని చేపట్టిందని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు వృత్తిలో మరింత రాణించడానికి టెక్నాలజీని చక్కగా వాడుకోవాలని సూచించారు. 

Related Posts