YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గెల్లు వర్సెస్ బీజేపీ... రంగంలోకి దత్తన్న

గెల్లు వర్సెస్ బీజేపీ... రంగంలోకి దత్తన్న

కరీంనగర్, ఆగస్టు 25, 
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతని మంత్రి హరీష్ రావు, తన భుజాన పెట్టుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసి, టీఆర్ఎస్ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని ప్రకటించిన దగ్గర నుంచి హరీష్, హుజూరాబాద్‌లోనే ఉంటూ, కారు గుర్తుకు ఓటు వేయాలని తిరుగుతున్నారు.అయితే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్ధి పెద్దగా హైలైట్ కాకుండా, కేవలం కారు మాత్రమే కనిపించేలా ప్రచారం చేసుకుంటున్నారు. అటు ప్రభుత్వం తరుపున జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు రాజకీయంగా ఈటల రాజేందర్ ని దెబ్బ తీయడానికి హరీష్ అదిరిపోయే వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఈటలకు అండగా ఉంటున్న నాయకులని తనవైపుకు తిప్పుకుంటున్నారు. అలాగే ఈటల అనుచరులని వరుసపెట్టి టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు.ఇక అన్నిటికంటే ముఖ్యంగా హరీష్… హుజూరాబాద్ వార్‌నే మార్చేస్తున్నారు. అసలు హుజూరాబాద్‌లో కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్లుగా ఫైట్ జరుగుతుంది. అక్కడ ప్రజలు కూడా అలాగే పోరుని చూస్తున్నారు. ఇలా పోరు జరగడం వల్ల… ప్రజలు ఎక్కువగా ఈటలపై సానుభూతితో ఉన్నారు. దాని వల్ల హుజూరాబాద్‌లో ఈటలకే ప్రజల మద్ధతు ఎక్కువ కనిపిస్తోంది. దీంతో హరీష్ వ్యూహాత్మకంగా ఈటలని సైడ్ చేసి పోరులోకి బీజేపీని తీసుకొస్తున్నారు. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పోరు మారుస్తున్నారు.ఇలా చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలని హరీష్ ఎండగట్టవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల బీజేపీ తమ రాష్ట్రానికి ఏం చేయలేదని చెబితే, అప్పుడు ప్రజలు కూడా బీజేపీపై వ్యతిరేకత పెంచుకుంటారు. ఇక బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఈటలకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే హరీష్, బీజేపీనే హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హరీష్ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. హుజూరాబాద్ ప్రజలు ఈటలనే చూస్తున్నారని అర్ధమవుతుంది.
దత్తన్నకు సత్కారం
 కులాల వారీగా సమీకరణాలు జరుపుతూ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్ని ఇన్నీ కావు. హుజురాబాద్ వేదికగా ఆయా కులాలా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాయి. తాజాగా బీజేపీ మరో భారీస్కెచ్‌కు రంగం సిద్దం చేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గొల్ల, కుర్మలను మచ్చిక చేసుకునేందుకు ఈటల కూడా తన వ్యూహాలకు పదునుపెట్టారు.ఇప్పటికే యాదవులతో సమావేశమైన ఈటల రాజేందర్ యాదవుల ఓట్లను చీల్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా బీజేపీ నాయకత్వం మరో అడుగు ముందుకేసి కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండారు దత్తాత్రేయను రంగంలోకి దింపాలని భావించింది. ఈ మేరకు ఈ నెల 26న బండారు దత్తాత్రేయకు ఆత్మీయ సత్కారం కార్యక్రమాన్ని జమ్మికుంటలో ఏర్పాటు చేస్తున్నట్టు మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ తెలిపారు. పార్టీలకు అతీతంగా గొల్ల కుర్మలంతా కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఆమె కోరారు. అయితే, రాజ్యంగ బద్దమైన పదవిలో కొనసాగుతున్న దత్తన్న కుల సంఘాల సమావేశాలకు రావడం సరైందేనా అన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.

Related Posts